|
|
| సమస్య పరిష్కారం |
| ప్రచురణ తేది: 26/10/2009 |
|
మూ డు కాలనీల ప్రజల తాగునీటి వెతలను సహ చట్టం తీర్చింది.హైదరాబాద్ కూకట్పల్లి సర్కిల్లోని హైదర్నగర్ రిజర్వాయర్లో ఎక్కువ సామర్థ్యం గల బూస్టర్లను ఏర్పాటు చేయించింది. తాగునీటి సమస్యపై స్థానికులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా జలమండలి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. బూస్టర్ను కూడా వేరే ప్రాంతంలో ఏర్పాటు చేశారు. దీనిపై ప్రజలు నిరసన తెలిపినా స్పందించలేదు. దాంతో స్థానికులు 'ఈనాడు ముందడుగు'ను సంప్రదించి సహ దరఖాస్తు చేశారు. దాంతో పాతవాటిని తొలగించి రెండు 30 హెచ్పీ బూస్టర్ల ఏర్పాటు పనులను అధికారులు ప్రారంభించారు. స.హ. చట్టంతో తమ సమస్య పరిష్కారం కావడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. |
|