| అప్పీలేట్ అధికారికీ శిక్ష |
| ప్రచురణ తేది: 01/09/2009 |
|
స హ చట్ట స్ఫూర్తికి విఘాతం కలిగించేలా ప్రవర్తించిన అప్పీలేట్ అధికారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కేంద్ర సమాచార కమిషన్ ఆదేశించింది. అప్పీలేట్ అథారిటీ వ్యవస్థ నిరుపయోగంగా మారుతోందని విమర్శలు వస్తున్న తరుణంలో కేంద్ర సమాచార కమిషనర్ శైలేష్ గాంధీ ఈ సంచలన తీర్పు ఇచ్చారు. అమిత్ మెహతా అనే వ్యక్తి ఓ సమాచారం కోరుతూ జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయానికి దరఖాస్తు చేశారు. నిర్దేశిత గడువులోగా సమాచారం రాకపోవడంతో సీఐసీకి అమిత్ ఫిర్యాదు చేశారు. దాన్ని పరిశీలించిన సీఐసీ. ఫిర్యాదును పరిష్కరించాలంటూ అప్పీలేట్ అధికారి అయిన విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ను ఆదేశించింది. అయినా.. రిజిస్ట్రార్ స్పందించలేదు. దాంతో అమిత్ తిరిగి సీఐసీని ఆశ్రయించారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కమిషన్.. రిజిస్ట్రార్పై చర్యలు తీసుకోవాలని విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ను ఆదేశించింది. చర్యలు తీసుకున్నట్లుగా తెలియజేసే పత్రాన్ని తమకు పంపించాలని అందులో పేర్కొన్నారు.
- ఆర్.శ్యాం, ఒంగోలు |
|