| దరఖాస్తుదారుకు పూర్తి సమాచారం..... |
| ప్రచురణ తేది: 01/09/2009 |
|
దరఖాస్తుదారుకు పూర్తి సమాచారం ఇవ్వనందుకు జాతీయ మహిళా కమిషన్(ఎన్.సి.డబ్ల్యూ)కు సీఐసీ రూ.10 వేల జరిమానా విధించింది. సంబంధిత మొత్తాన్ని దరఖాస్తుదారుకు పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. నిథారీ హత్యల అనంతరం మహిళా కమిషన్ సభ్యులు అక్కడకు చేసిన పర్యటనల వివరాలను కోరుతూ లోకేష్ బాత్రా అనే వ్యక్తి దరఖాస్తు చేశారు. గడువు దాటినా ఎన్.సి.డబ్ల్యూ. సమాచారం ఇవ్వకపోవడంపై సీఐసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. |
|