| ప్రజాప్రయోజనం ఉంది |
| ప్రచురణ తేది: 26/10/2009 |
|
క డప బీఎస్ఎన్ఎల్ అధికారులకు సీఐసీ షాక్ ఇచ్చింది. ప్రజాప్రతినిధుల టెలిఫోన్ బకాయిల వివరాలను అందించాల్సిందేనని స్పష్టం చేసింది. జిల్లాలోని ప్రజాప్రతినిధుల టెలిఫోన్ బకాయిల సమాచారం అడుగుతూ కడపకు చెందిన నాజర్ బాషా దరఖాస్తు చేశారు. దానికి స్పందించిన బీఎస్ఎన్ఎల్ డీజీఎం 'మీరు అడిగిన సమాచారం మూడో పక్షానికి సంబంధించినది.. అందులో ఎలాంటి ప్రజా ప్రయోజనం లేద'ంటూ సెక్షన్ 8(1)(జె) కింద దరఖాస్తును తిరస్కరించారు. మొదటి అప్పీలు చేసినా అదే సమాధానం. శ్రీకాకుళం జిల్లాలో ఇదే సమాచారాన్ని అక్కడి అధికారులు ఇచ్చారని చెబితే.. 'వారికి చట్టంపై అవగాహన లేదేమో'నన్నారు. బాషా రెండో అప్పీలు చేశారు. ఈ నెల అయిదో తేదీన టెలీ కాన్ఫరెన్స్లో దరఖాస్తుదారు వాదనలను కేంద్ర సమాచార కమిషనర్ అన్నపూర్ణ దీక్షిత్ విన్నారు. 'అడిగిన సమాచారం పూర్తిగా ప్రజా ప్రయోజనానికి సంబంధించింది. 'ఇలాంటి సమాచారాన్ని ఇవ్వకుంటే బీఎస్ఎన్ఎల్పై నమ్మకం పోతుందని' అన్నారు. |
|