| రాష్ట్ర బార్ కౌన్సిల్స్ కూడా సహ చట్టం పరిధిలోకి |
| ప్రచురణ తేది: 15/09/2009 |
|
రాష్ట్ర బార్ కౌన్సిల్స్ కూడా సహ చట్టం పరిధిలోకి వస్తాయని సీఐసీ, మహారాష్ట్ర సమాచార కమిషన్లు స్పష్టం చేశాయి. అందుకనుగుణంగా దరఖాస్తుదారులకు సమాచారం ఇవ్వాలని గోవా, మహారాష్ట్ర బార్కౌన్సిళ్లను ఆదేశించాయి. పార్లమెంట్లోచేసిన చట్టంతోనే కౌన్సిళ్లు ఏర్పాటైనందున.. కచ్చింతంగా పబ్లిక్ అథారిటీలు అవుతాయని మహారాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ సురేష్ జోషి చెప్పారు. దరఖాస్తులకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్పందిస్తుంటే.. రాష్ట్రాల కౌన్సిళ్లు సమాచారం ఇవ్వడానికి సమస్యేంటన్నారు. |
|